TG: కేబినెట్లో చర్చ జరగ్గానే రుణమాఫీ జరిగినట్లు చెబుతున్నారని BRS నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో బహిరంగ విచారణ చేస్తే రుణమాఫీ అర్హులు తెలుస్తారని అన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ఎవరికీ మనసు రాదన్నారు.కేసీఆర్పై వ్యతిరేకతే కేంద్ర బిందువుగా ఏమైనా చేస్తున్నారని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎవరికి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేబినెట్ సబ్ కమిటీ పేరుతో జాప్యం చేయాలనేది కాంగ్రెస్ ఉద్దేశమన్నారు.