ముక్కుపచ్చలారని చిన్నారులను వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న 9 మంది, కొనుగోలు చేసిన 18 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం ఎల్బీనగర్లో రాచకొండ పోలీస్ కమిషనర్ (సీపీ) సుధీర్ బాబు వెల్లడించారు. గత ఫిబ్రవరి 25న చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసిన 11 మందిని కస్టడీకి తీసుకుని విచారించగా తాజాగా ఈ గుట్టు బయటపడింది.