IPL 2024 సందర్బముగా క్రికెట్ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే IPL లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ టీమ్ను ఆరాధిస్తారు. తాజాగా RCB vs KKR మ్యాచ్లో ఈ జట్టుకు చెందిన ఓ చిన్నారి ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్లకార్డుతో కనిపించింది. ‘ఆర్సీబీ కప్ గెలిచే వరకు నేను పాఠశాలకు వెళ్లను' అని ప్లకార్డుపై రాసి ఉంది. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కూలుకు వెళ్లొద్దని గట్టి ప్లాన్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.