ఐపీఎల్‌ 2025.. ఆటగాళ్లకు బీసీసీఐ తీపి కబురు

62చూసినవారు
ఐపీఎల్‌ 2025.. ఆటగాళ్లకు బీసీసీఐ తీపి కబురు
ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీలో ఆడే ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్‌ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజుల కోసం ఒక్కో ఫ్రాంఛైజీ రూ.12.60 కోట్లు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త విధానం వల్ల ఒక ప్లేయర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే మ్యాచ్‌ ఫీజుల రూపంలో రూ.1.05 కోట్లు ఆర్జిస్తాడు.

సంబంధిత పోస్ట్