రాజ‌కీయాల‌కు బండి సంజ‌య్ దూర‌మా?

54చూసినవారు
రాజ‌కీయాల‌కు బండి సంజ‌య్ దూర‌మా?
కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు దూరం కాబోతున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. కాకపోతే ఇది శాశ్వతం కాదు తాత్కాలికమే. శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంత్రి బండి సంజయ్ సోమవారం ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. నేటి నుండి విజయదశమి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడి వలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం ఉండ‌నున్నారు.

సంబంధిత పోస్ట్