వయనాడ్ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వయనాడ్లో ప్రతివ్యక్తి నాకు ప్రేమ, అభిమానాన్ని అందించారు. సొంత వ్యక్తిలా చూసుకున్నారు. మిమ్మల్ని నేను ఓటర్లుగా భావించను. నా సోదరి ప్రియాంక గురించి ఎలా ఆలోచిస్తానో.. మీ గురించి అంతే’ అని పేర్కొన్నారు.