TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ను జగదీశ్ అవమానించారని, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీశ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.