’’వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్ నైజం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సమాజాన్ని కలిపే వారినే జనం గుర్తు పెట్టుకుంటారు. వైసీపీ ఎమ్మెల్సీ అతడి కారు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నారు. సమాజానికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగివస్తుంది.‘‘ అని అన్నారు.