ఒక దశాబ్ద కాలంగా సింహాల బాగోగులు చూసుకుంటున్న సంరక్షకుడిని ఓ సింహం చంపేసింది. ఈ ఘటన నైజీరియన్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఓబఫెమి అవులావో యూనివర్సిటీలోని జంతు ప్రదర్శన శాలలో గత పదేళ్లుగా ఓలాబోడే ఓలవూయి అనే వ్యక్తి సింహాల బాగోగులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో వాటికి ఆహారం పెడుతుండగా, ఓ సింహం ఓలవూయిపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో ఓలవూయి చనిపోయాడు.