జువ్వాడి నర్సింగ్ రావుని సన్మానించిన సుఖీభవ ఆర్గనైజేషన్

57చూసినవారు
జువ్వాడి నర్సింగ్ రావుని సన్మానించిన సుఖీభవ ఆర్గనైజేషన్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బుధవారం ప్రజా ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గల్ఫ్ సంక్షేమ బోర్డు జీవో నెంబర్ 205 ద్వారా ఏర్పాటు చేసినందుకు కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావును కలిసి సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు బొక్కెనపల్లి నాగరాజు, స్ఫూర్తి మహిళ సొసైటీ ఎక్స్ ఎంపీపీ గుడిసె అంజమ్మలు కలిసి కాలువతో సన్మానించారు. మెట్ పల్లి పట్టణంలోని కోనో కార్పొరేషన్ చెట్లను తొలగించాలని, కుక్కల బెడదను నివారించాలని కోరారు.

సంబంధిత పోస్ట్