పోలీసుల గుప్పిట్లో జైనూరు

66చూసినవారు
పోలీసుల గుప్పిట్లో జైనూరు
గిరిజన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు ముగ్ధూంను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఈ ఘటనకు నిరసనగా బుధవారం ఓ వర్గానికి చెందిన వారు జైనూర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘటనలో సుమారు 70 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రాళ్లు, కర్రల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రూ.కోట్ల విలువైన ఆస్తులకు నష్టం వాటిల్లగా.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

సంబంధిత పోస్ట్