పొన్నియన్ సెల్వన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జయం రవి. ఆయన ఆంథోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం ‘సైరన్’. ఈ మాస్ ఎంటర్టైనర్ను గంగ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో ఈ నెల 23న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జి.వి తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్న పాత్రలు పోషించాను’ అని అన్నారు.