ఆన్లైన్ గేమింగ్ల పేరుతో బెట్టింగ్లు నిర్వహిస్తున్న కంపెనీలపై కొరడా ఝుళిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్లైన్ గేమింగ్లో బెట్టింగ్ పేరుతో డబ్బు చెల్లింపులు నిషేధమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ నిబంధనలు-2021కి చేసిన సవరణలను ఆమోదించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమింగ్లో నగదు లావాదేవీలు చట్టబద్ధమే కానీ.. నగదు బెట్టింగ్, ప్రిడిక్షన్ ఉన్న గేమింగ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.