BRS నేత, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీఆర్ఎస్లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని రాములు భావించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన ఇవాళ బీజేపీలో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ పాల్గొన్నారు.