కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

69చూసినవారు
కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ను చేస్తూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఇవాళ సాయంత్రం తీర్పును వెల్లడించనుంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడీవేడి వాదనలు జరిగాయి. కేజ్రీవాల్‌ తరుపున అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్‌ను వెంటనే ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని, నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్