ఒక గ్లాసు నీళ్లలో టీస్పూన్ వాము, జీలకర్ర వేసి మరగిస్తే అసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. గర్భిణీలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపుతో ఉన్న వారికి ఎదురయ్యే మలబద్దకం, అజీర్తి దూరమవుతుంది. వామును నీళ్లలో వేసి మరిగించి ప్రతీ రోజూ పరగడుపున తాగితే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి కూడా దూరమవుతుంది. నోటిని శుభ్రంగా ఉంచడంలో కూడా వాము ఉపయోగపడుతుంది.