తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

62చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన సతీమణితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈవో ధర్మారెడ్డి సీజేఐకి శేషవస్త్రంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్