భద్రాచలం శ్రీ సీతారాముని కల్యాణ తలంబ్రాలు బుకింగ్ స్టార్ట్ చేసిన బాన్సువాడ డిపో మేనేజర్

673చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారాముని కల్యాణ తలంబ్రాలు బుకింగ్ స్టార్ట్ చేసిన బాన్సువాడ డిపో మేనేజర్
బాన్సువాడ పట్టణంలోని బస్ డిపోలో ఈనెల 30న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భద్రాచలం నుండి ముత్యాల తలంబ్రాలను నేరుగా కస్టమర్లకు అందించే విధంగా టిఎస్ఆర్టిసి లాజిస్టిక్స్(కార్గో) ఏర్పాట్లు చేసింది. బాన్సువాడ డిపో పరిధిలో బుకింగ్ శుక్రవారం బాన్సువాడ డిపో మేనేజర్ సదాశివ్ ప్రారంభించారు. 116/- రూపాయలతో బుకింగ్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికి తలంబ్రాలు చేరవేయబడతాయని ఈ సందర్భంగా డిపో మేనేజర్ తెలియజేశారు. కార్గో కౌంటర్లు అన్నిటిలో బుకింగ్ చేసుకునే సదుపాయం కలదు. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కార్గో కౌంటర్ కి విచ్చేసి బుక్ చేసుకోవచ్చు లేదా డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(ఇర్ఫాన్ - 9154298729) ను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్