కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీడిఓ

458చూసినవారు
కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీడిఓ
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని గ్రామ పంచాయతీలో జరుగుతున్న కంటి వెలుగు సెంటర్ ను బాన్సువాడ ఎంపీడీఓ. సత్యనారాయణ రెడ్డి, మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్. కే శ్రీనివాస్ రెడ్డి తో కలసి శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో అందరు కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి. టి రాజేశ్వర్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్. మన్నె చిన్న సాయిలు, కంటి వెలుగు డాక్టర్. రత్నం, జిపి జూనియర్ అసిస్టెంట్. అశోక్, ఏఎన్ఎమ్. గంగామణి, వైద్యసిబ్బంది, గ్రామస్తులు టేకుల రమేష్, జమిల్, బలరాం సేట్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్