హోం మంత్రిని కలిసిన సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు

667చూసినవారు
హోం మంత్రిని కలిసిన సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు
హైదరాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ని ఓ ప్రైవేటు కార్యక్రమం లో మర్యాదపూర్వకంగా సేవాలాల్ సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రామా నాయక్ కలిసారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచడమే కాకుండా అన్ని ఉద్యోగ ప్రకటనలలో అమలుపరిచి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా పోడు భూముల సమస్యలు కూడా అతి త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పిడపర్తి రాజు మరియు బచ్చలకూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్