ఆర్టీసీ బస్టాండ్ లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థల పరిశీలన

599చూసినవారు
ఆర్టీసీ బస్టాండ్ లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థల పరిశీలన
నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఏర్పాట్లను ఆదివారం బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం కోసం సోమవారం మరుగుదొడ్ల నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్