తాడ్కోల్ గ్రామంలో రెండో రోజు కొనసాగుతున్న సర్వే

771చూసినవారు
తాడ్కోల్ గ్రామంలో రెండో రోజు కొనసాగుతున్న సర్వే
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ మండలం తాడకొల్ గ్రామ శివారు ప్రాంతంలోని ఎర్ర మన్ను కుచ్ఛ లో కొనసాగుతున్న సర్వే.
సర్వే లో భాగంగా బాన్సువాడ ఏంపిపి దొడ్ల నీరజా వెంకట్ రామ్ రెడ్డి ఎర్ర మన్ను కుచ్చ పరిధిలో సొంత ఇండ్లు లేని వారి గురించి, సొంత స్థలాలు లేని వారి గురించి, ఏరియా లో డ్రెయిన్లు నిర్మాణం గురించి, రోడ్ల నిర్మాణం గురించి స్వతాహగ సర్వే నిర్వహిస్తూ కాలనీ ప్రజలను అడుగుతూ వివరాలను సేకరించారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, సభాపతి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగుల గంగారాం, ఎంపిటిసి శ్రీమతి ఇందిరా రాజు , బాన్సువాడ మండలం పరిధిలోని గ్రామ పంచాయితీ కార్యదర్శిలు ప్రశాంతి, సాయికుమార్, రఘు, సురేష్ , శ్రావణ, వార్డ్ మెంబర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్