కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని తుప్ దాల్ గ్రామంలో హనుమాన్ ఆలయంపై గల శిఖరం కోతుల బెడదతో విరిగిపోయింది. ఖత్గావ్ మహారాజ్ శ్రీ మల్లికార్జునప్ప స్వామి సూచనల మేరకు బుధవారం హనుమాన్ ఆలయ శిఖరం పునః ప్రతిష్టాపన చేసి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఖతగావ్ మహారాజ్ శ్రీ మల్లికార్జున అప్ప స్వామి, గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.