కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

53చూసినవారు
కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ చెప్పారు. మంగళవారం ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, తూకం చేసే ప్రక్రియను, తూకం యంత్రాలను, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని నిర్వహకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్