మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నలసపోరా ప్రాంతంలోని రెస్టారెంట్లో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్ని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమించారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.