తాము అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. పశువులు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తామని తెలిపారు. గోపాలమిత్రలను మళ్లీ నియమించడంతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ పథకాలు అమలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు గ్రాట్యూటీ, ఆశావర్కర్లుకు కనీస వేతనం పెంచుతామని చెప్పారు.