మూడో రోజు నాలుగు నామినేషన్లు దాఖలు

52చూసినవారు
మూడో రోజు నాలుగు నామినేషన్లు దాఖలు
జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి శనివారం మూడో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకు అందజేశారు. ఆయన నామినేషన్ ప్రక్రియలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హనుమంతు షిండే పాల్గొన్నారు. టీపీఎస్ అభ్యర్థిగా బసవరాజ్, స్వతంత్ర అభ్యర్థులుగా ప్రవీణ్, రామారావు పాటిల్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్