వేసవి తీవ్రత ఎక్కువ ఉన్న దృశ్య ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి లక్ష్మణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించాలి అన్నారు. చలువ అద్దాలు పెట్టుకోవాలన్నారు. నీరు ఎక్కువగా తాగాలని, పళ్ళ రసాలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ లక్షణాలు ఉంటే ఆసుపత్రికి రావాలన్నారు.