ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బీడీ కార్మికుల కాలనిలోను శ్రీ దత్ర పీఠం లో వెలసిన శ్రీ భగలాముఖి అమ్మవారికి శుక్రవారం పీఠాధిపతి క్రాంతి పటేల్ ప్రత్యేకాలంకరణలతో శుక్రవారం పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి, అన్ని రకాల ఫల నైవేద్యం ఏర్పాటు చేసి హారతులు ఇచ్చి భక్తిలకు దర్శనం కల్పించారు.