పోచారం చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి

61చూసినవారు
పోచారం చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు సాగునీరు అందిస్తున్న పోచారం ప్రాజెక్ట్ నీటిని ఖరీఫ్ సీజన్ కు చివరి ఆయకట్టు వరకు అందించాలని ఎల్లారెడ్డి ఎంపిపి మాధవి అన్నారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో చివరి మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వెల్లుట్ల ఎంపిటిసి సుతారి లక్ష్మి మృతికి సంతాపంగా 2నిమిషాలు మౌనం పాటించారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని ఎంపీపీ సూచించారు.

సంబంధిత పోస్ట్