గుర్జల్ లో దుర్గామాత లడ్డూ దక్కించుకున్న ముస్లిం సోదరులు

83చూసినవారు
గుర్జల్ లో దుర్గామాత లడ్డూ దక్కించుకున్న ముస్లిం సోదరులు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం గుర్జల్ గ్రామంలో త్రినేత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రాత్రి నుండి తెల్లవారుజాము వరకు అంగరంగ వైభవంగా సాగింది. అమ్మవారి వద్ద ఉంచిన లడ్డును సోమవారం వేలం వేయగా, గుర్జల్ గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు వేలంలో లడ్డూ దక్కించుకొని మతసామరస్యం చాటుకున్నారు. గత 3ఏళ్లుగా లడ్డూను ముస్లిం సోదరులే దక్కించుకోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్