తాగునీటి కోసం రోడ్డెక్కిన సోమార్పేట్ వాసులు

79చూసినవారు
ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ లో తాగునీటి ఎద్దడి ఉన్న ఎవరు పట్టించుకోవడంలేదంటూ గ్రామంలో మహిళలు, గ్రామస్థులు కలిసి ఆదివారం రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టినట్లు గ్రామ పెద్ద అయిన విశ్రాంత ఉపాధ్యాయుడు హన్మంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆయన మాట్లాడుతూ. ఎన్నిక్షల సమయంలో తప్ప సమస్యలు వస్తే ప్రజాప్రతినిధులు స్పందించరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్