రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఎర్ర జెండాలు పాతిన సొసైటీ

84చూసినవారు
రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఎర్ర జెండాలు పాతిన సొసైటీ
లింగంపేట మండలం పోల్కంపేట్ కు చెందిన ఓ రైతు సొసైటీలో దీర్ఘకాలిక రుణం తీసుకొని చెల్లించలేదని, గురువారం సొసైటీ సిబ్బంది అతని పొలంలో ఎర్రజెండాలు పాతారు. ఈ భూమిని ఎవరూ కొనవద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమ్మడానికి కూడా వీల్లేదని బోర్డు పెట్టారు. సొసైటీ రుణాల పేరుతో తనను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ. రుణం చెల్లింపుకు కాస్త గడువు అడిగిన ఇవ్వకుండా తన పరువు తీశారని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్