కారుపై కన్వర్ యాత్రికుల దాడి.. ప్రాణ భయంతో పరుగులు(వీడియో)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. కన్వర్‌ యాత్రికులు ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరుగులు పెట్టగా వారిని వెంబడించి మరీ చితకబాదారు. నలుగురిలో ఓ వ్యక్తిని విపరీతంగా కొట్టారు. అయితే తాము తీసుకెళ్తున్న కన్వర్‌ను ఆ వారు కారుతో ఢీకొట్టడంతో దాడి చేసినట్లు యాత్రికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్