వడదెబ్బతో కల్లం వద్దే రైతు మృతి

1064చూసినవారు
వడదెబ్బతో కల్లం వద్దే రైతు మృతి
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రైతు రాజేశం (47) పది రోజుల క్రితం వడ్లు అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకెళ్లాడు. వడ్లు అమ్మకం అవ్వకపోయే సరికి వడ్లను ఆరబోస్తున్న క్రమంలో వడదెబ్బకు గురై కల్లంలోనే కుప్పకూలి మృతి చెందాడు. రాజేశం కూతురుకి మంగళవారం విడుదలైన పది ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయి. తండ్రి కూతురి ఫలితాలు తెలియకుండానే చనిపోవడంతో గ్రామస్తులను కలచివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్