ధర్మారం మండలంలో తేలికపాటి వర్షం

1885చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో గత రాత్రి నుండి సోమవారం తెల్లవారుజామున వరకు చిరుజల్లులు కురిశాయి. గత కొన్ని రోజులుగా ఎండ వేడికి తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు చిరుజల్లులు పడడంతో కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి జిల్లాలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్