మాగుడిలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

1087చూసినవారు
మాగుడిలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం
పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, శ్రీరాజ రాజేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీక్రోది నామ సంవత్సరం ఉగాది పర్వదినమును పురస్కరించుకుని ఆలయకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ మంటపంలో పురోహితులు గుండి రాజేశ్వర్ శర్మ, శ్రీనివాస్ శర్మలచే పంచాంగ శ్రవణము చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటి అధ్యక్షులు, ఒరుగల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గొల్లపెల్లి రాంచంద్రం, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్