పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ వాహనాలకు GPS

80చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ వాహనాలకు GPS
పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు GPS లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ మేరకు సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు. ఒకవేశ ఏమైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్