హైదరాబాద్లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని బండ్లగూడజాగీర్కు చెందిన ఆనంద్(42) అనే వ్యక్తి ఆన్లైన్ గేమ్లు ఆడి అప్పుల పాలయ్యాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై భార్య, కుమారుడికి విషమిచ్చి.. అనంతరం ఆనంద్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు.