ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మారం, పెగడపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ముందుగా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. అనంతరం పెగడపెల్లి మండల కేంద్రంలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లోనూ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారు.