తాసిల్దార్ కార్యాలయం ముందు హమాలి కార్మికుల ధర్నా

390చూసినవారు
తాసిల్దార్ కార్యాలయం ముందు హమాలి కార్మికుల ధర్నా
తాసిల్దార్ కార్యాలయం ముందు తాడికల్ సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల హమాలి కార్మికులు కూలీ రేట్లు పెంచాలని, బీహార్ కార్మికులను పనిలో పెట్టుకోకూడదు, ఈ విషయంపై ఎక్కువ చోరువ చూపి సొసైటీ చైర్మన్ రైతులకు అమాలి కార్మికులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి గ్రామాలలో ప్రజల మధ్య అశాంతి చర్యలకు గురి చేస్తున్నాడని అలాంటి వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో తాసిల్దారు తీసుకుని కూర్చుండ బెట్టి సామరస్య పూర్వకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో గతంలో ఏవైతే ఉన్నాయో కూలీ రేట్ల ప్రకారం వర్తింపు చేయాలని, బీహార్ కార్మికులను ఎంత డబ్బులు కేటాయించారు అంత వరకు పని వినియోగించుకుని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా సొసైటీ పాలక వర్గాన్ని ఆదేశించారు.

సొసైటీ పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించింది. కార్మికులు కూడా పని చేస్తామని స్థానిక ప్రజానీకానికి ఉపాధి కల్పించే విధంగా సొసైటీ పాలకవర్గం ఆలోచించాలని అమాలి కార్మికులు కూడా రైతుల్లో పని చేస్తున్నాము .రైతుల బాధలు అందరికీ తెలిసినవే రైతు యొక్క హక్కులకోసం కార్మిక సంఘంగా, రైతు సంఘాలు గా, సొసైటీ పాలకవర్గం కూడా కలిసి ఉండాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పాలకవర్గానికి సూచించారు. కాకపోతే తాసిల్దార్ ప్రతి గ్రామాల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ చర్చలు సానుకూలంగా జరగడం వల్ల ఎక్కడికక్కడ అమాలి కార్మికులు పాత రేట్ల ప్రకారం పనులు చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, నాయకులు ఎస్ డి బాబా, రాజన్న ,రాగుల కొమురయ్య, శ్రీనివాసు ,తిరుపతి, రాజయ్య, బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :