జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట్ లోనీ ఆది పెద్దమ్మ తల్లిని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దామోదర్, మాజి ఉప సర్పంచ్ రాజనర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్, నాయకులు గంగా రెడ్డి, హరీష్, రాజలింగు, శేఖర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.