గుర్తు తెలియని వృద్ధుడు మృతి
జమ్మికుంట రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు దాటే క్రమంలో అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడు(60) చనిపోయాడు. మృతుడు తెలుపు షర్ట్ గీతల డిజైన్, బ్లూ గీతల లుంగీ ధరించి ఉన్నాడు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. రామగుండం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిస్తే హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి 9949304574, 8712658604 కి తెలుపగలరు.