బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ, ఐటీ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని బీఆర్ఎస్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదని విమర్శించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని చెప్పారు. కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.