కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని మానేరు జలాశయంలో డిసెంబర్ 3న మృతదేహం లభ్యం అయింది. ఇతని వివరాలు పోలీసులకు దొరకకపోవడంతో దర్పణ్ యాప్ లో పొందపరిచారు. జగిత్యాల చెందిన హర్కల గోపికృష్ణ ప్రభుత్వ గణాంకశాలలో సూపరింటెండెంట్ గా పని చేశారు. పదోన్నతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా డిసెంబర్ 2న కరీంనగర్ వచ్చి మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్దారించారు.