Feb 11, 2025, 08:02 IST/
చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. మళ్లీ బతికిన వ్యక్తి!
Feb 11, 2025, 08:02 IST
కర్ణాటకలోని హవేరీలో షాకింగ్ ఘటన జరిగింది. దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో బాధపడుతున్న బిష్టప్ప అనే వ్యక్తిని కుటుంబీకులు ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు వైద్యం అందించినా కూడా ఆయనలో చలనం లేకపోవడంతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇంటి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో ఇంటికి తీసుకెళ్తుండగా శ్వాస తీసుకోవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.