గంగా మాతకు హారతి సమర్పణ

61చూసినవారు
గంగా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి స్థానిక గోదావరి నది వరకు దేవస్థానం ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు మేళా తాళాలతో వెళ్లి గోదావరి వద్ద గంగా మాతకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి నదికి హారతి హారతి సమర్పించి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్