జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ విశాల సహకార సంఘం వారి ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మెట్ పల్లి మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు ప్రారంభించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వరి యాసంగి పంట కొనుగోలు ధర ఏ గ్రేట్ 2203 కాగా, సాధారణ రకం 2183 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనినీ రైతులు
సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.