పదుల సంఖ్యలో హరితహారం చెట్ల నరికివేత

1064చూసినవారు
హరితహారంలో నాటిన చెట్లను పదుల సంఖ్యలో నరికిన ఘటన శంకరపట్నంలోని ఆముదాలపల్లిలో చోటు చేసుకుంది. కనీస అవగాహన లేకుండా గుడ్డిగా మొక్కలను నాటడం, విద్యుత్ సరఫరాకు అడ్డుగా ఉన్నాయని వాటిని ఆశాఖవారు నరకడం పరిపాటిగా మారింది. నాటడం ఎందుకు? నరకడం ఎందుకు? హరితహారం అభివృద్ధిపై పెడుతున్న ప్రజాధనం వృధాకి బాధ్యులు ఎవరని ఆదివారం ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్