మానకొండూరు: ఎంబీఏ విద్యార్థిని సమతకు ఎమ్మెల్యే కవ్వంపల్లి చేయూత

70చూసినవారు
మానకొండూరు: ఎంబీఏ విద్యార్థిని సమతకు ఎమ్మెల్యే కవ్వంపల్లి చేయూత
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సాయబ్ పల్లెకు చెందిన ఎంబీఏ విద్యార్థిని కామెర సమతకు మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఆర్థికంగా చేయూతనందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్